రెండు లారీలు ఢీకొని బీభత్సాన్ని సృష్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ.. సంగారెడ్డి పట్టణం నుంచి చౌరస్తా దాటుతున్న సమయంలో రెండు లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ సమయంలో అక్కడే రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిపైకి ఈ రెండు లారీలు దూసుకుపోగా అతను పరుగులుతీసి త్రుటిలో ప్రాణాలను దక్కించుకున్నాడు. కాగా సంగారెడ్డి పట్టణంలో నుంచి వచ్చిన లారీలోని క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో దాదాపు గంటసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
సంగారెడ్డిలో లారీల బీభత్సం