ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై యుద్ధానికి యావత్ భారతదేశం నడుం బిగించింది. దేశ ప్రధాని మోడీ ప్రకటన మేరకు 21 రోజులు పాటు ప్రజలంతా ఇల్లకే పరిమతమవ్వడానికి సిద్ధమైయ్యారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పనులులేక ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అలానే ఎందరో పోలీస్ అధికారులు, డాక్టర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు, శానిటేషన్ వర్కర్లు ఇలా ఎందరో ధైర్యంగా మన గురించి పని చేస్తున్నారు. ఇక ఇలాంటి విపత్తులు వచ్చిన ప్రతిసారీ సాయానికి చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఈ పంధాలోనే తాజాగా కరోనా పై పోరాటానికి సంబంధించిన కార్యక్రమాలకు తన వంతు బాధ్యతగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 1.25 కోట్లు విరాళం అందిస్తున్నట్లుగా ప్రకటించారు.
కరోనాపై యుద్ధానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల విరాళం