క‌రోనా మృతుల సంఖ్య‌ 23,956

క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌నిపోయిన వారి సంఖ్య 23,956గా ఉన్న‌ది.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న ట్వీట్‌లో ఈ విష‌యాన్ని చెప్పింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 529093 మందికి వైర‌స్ సంక్ర‌మించింది. సుమారు 122135 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 200 దేశాల్లో ఈ వైర‌స్ ఛాయ‌లు క‌నిపించాయి. అత్య‌ధిక సంఖ్య‌లో అమెరికాలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  ఇక అత్య‌ధిక మ‌ర‌ణాలు ఇట‌లీలో సంభ‌వించాయి. అమెరికాలో 82 వేల మందికి వైర‌స్ సోకిన‌ట్లు జాన్ హాప్కిన్స్ వ‌ర్సిటీ తెలిపింది.