స‌డ‌లించామ‌ని క‌ట్టు త‌ప్పొద్దు: రాజ‌స్థాన్ సీఎం

సవరించిన లాక్‌డౌన్ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి ప్రజలు ఇండ్ల‌కే పరిమితం కావాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. ప్రజలు ఎప్పటిలాగే బయటకు వెళ్లకుండా ఇండ్ల‌లోనే ఉండాలని కోరారు. ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించ‌డం కోసం లాక్‌డౌన్ నిబంధనలను దశలవారిగా సడలించిన‌ట్లు గెహ్లాట్ ఒక‌ ట్వీట్‌లో తెలిపారు.


కరోనా నుంచి ముప్పు ఇంకా తప్పలేదని, పోరాటం కొనసాగుతుందని గెహ్లాట్ పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రజలు మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాల‌ని, తరచూ చేతులు కడుక్కోవాలని, రోడ్లపై ఉమ్మి వేయరాదని గెహ్లాట్ సూచించారు.