ఉపేక్షించే ముచ్చటే లేదుః యడ్యూరప్ప

కరోనాను కట్టడి చేసే విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని పదరయనపురలో కరోనా రోగుల కోసం వెళ్లిన వైద్యులపై స్థానికులు దాడిచేసిన ఘటనపై యడ్యూరప్ప తీవ్రంగా స్పందించారు. బీబీఎంపీ అధికారులపై దాడిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలకు పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించినట్లు సోమవారం ట్వీట్‌ చేశారు. వైద్య కార్యకర్తలపై దాడిని కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా ఖండించారు. దాడికి పాల్పడినవారిపై కఠన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో తాము ముఖ్యమంత్రికి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపారు.